Complete Shatavahana History in Telugu


Shatavahana History in Telugu


శాతవాహనులు Shatavahana

(క్రీ.పూ 220-క్రీ.శ 225)

The Shatavahana are credited with establishing the first wide empire in southern India along with Telangana.

తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో మొదటి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజవంశంగా శాతవాహనులు ఖ్యాతి గడించారు.


➤ శాతవాహనులు పాలించిన ప్రదేశం :shatavahana ruled places
* తెలంగాణ
* ఆంధ్రప్రదేశ్
* కర్ణాటక
* మహారాష్ట్ర


➤ ద్రావిడదేశం, ఆర్యావర్తన దేశం మధ్య సాంస్కృతిక సమన్వయాన్ని సాధించి శాతవాహనులు చారిత్రాత్మకమైన పాత్రను నిర్వహించారని కే.ఎం.ఫణిక్కర్' పేర్కొన్నాడు.


 శాతవాహనులనే శాలివాహనులు, ఆంధ్రభృత్యులు, శాతకర్ణులు, ఆంధ్రులు అని వివిధ పేర్లతో పిలుస్తారు.


➤ శాతవాహనుల మూల పురుషుడు - శాతవాహనుడు


➤ శాతవాహనుడు అంటే వాహనాన్ని పొందినవాడు అని అర్ధం


➤  శాతవాహన అనే పదానికి కన్నడలో రైతు అని అర్థం


➤  పురాణాలు శాతవాహనులను ఆంధ్రభృత్యులు గా పేర్కొన్నాయి.


➤  శాతవాహనులు సుమారు క్రీస్తుపూర్వం 220 నుంచి క్రీ.శ.
225 వరకు పాలించారు.


శాతవాహనుల shatavahana
మొదటి రాజధాని                               : కోటిలింగాల (జగిత్యాలజిల్లా- పూర్వపు కరీంనగర్)
రెండవ రాజధాని                               : ప్రతిష్టానపురం (పైఠాన్)
మూడవ రాజధాని                             : ధాన్యకటకం
మూలపురుషుడు                               : శాతవాహనుడు
వంశ స్థాపకుడు                                : శ్రీముఖుడు
అధికార భాష                                  : ప్రాకృతం
శాసనభాష                                    : ప్రాకృతం 
రాజలాంఛనం                                : సూర్యుడు
వంశంలో గొప్పరాజు                         : గౌతమీపుత్ర శాతకర్ణి
శాతవాహనుల కాలం నాటి 
విదేశీ యాత్రికుడు                            : మెగస్తనీస్
శాతవాహనులు ఆర్యులా? ద్రావిడులా?
* B.S.Lహనుమంతరావు ప్రకారం శాతవాహనులు ఆర్యులు
R.S శర్మ ప్రకారం శాతవాహనులు ద్రావిదులు

శాతవాహనుల వర్ణం  shatavahana Race

 ➤ పురాణాలు శాతవాహన రాజ్యస్థాపకుడైన శ్రీముఖుడు విషల (శూద్రుడు) అని వర్ణించాయి.


➤ ప్రాచీన వాజ్ఞ్మయం ప్రకారం వీరు శూద్రులు


➤ సోమదేవసూరి రాసిన కథాసరిత్సాగరం ప్రకారం శాతవాహనులు శతుడు అనే యక్షునికి, బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే శాతవాహనులు (యక్షజాతి వారు).


➤ నాసిక్ శాసనంలో గౌతమీ బాలశ్రీ తనను తాను రాజర్షిపత్ని, క్షత్రియపత్నిగా పేర్కొనడం వలన శాతవాహనులు క్షత్రియులని కొందరు చరిత్రకారుల భావన.


నాసిక్ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణి ఏకబ్రాహ్మణుడు అని పేర్కొనడం వలన వీరు బ్రాహ్మణులని కొందరి భావన.


➤ జినప్రభాసూరి యొక్క కల్పప్రదీప గ్రంథం ప్రకారం శాతవాహనులు బ్రాహ్మణస్త్రీ, నాగరాజుల యొక్క సంతానము (నాగజాతి).


ద్వాత్రంశిక పుత్తలిక గ్రంథం ప్రకారం శాతవాహనుడు అనే బ్రాహ్మణునికి, నాగస్త్రీకి  జన్మించిన వారే శాతవాహనులు.


శాతవాహనుల జన్మస్థల వివాదం 

Controversy over the birthplace of the Shatavahana


శాతవాహనుల జన్మస్థలం గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి.
కర్ణాటక వాదం


➤ V.S. సుక్తాంకర్ అభిప్రాయంలో శాతవాహనుల జన్మస్థలం కర్ణాటకలోని బళ్ళారి.
కారణం: 3వ పులోమావి యొక్క మ్యాకదోని శాసనం,పల్లవ శివస్కందవర్మ యొక్క హిరహడగళ్ళి శాసనాలు బళ్ళారిలో దొరకడమే.


విదర్బ వాదం 


➤ V.V. మిరాశి ప్రకారం శాతవాహనులు మహారాష్ట్రలోని విదర్భకు చెందినవారు.
మహారాష్ట్ర వాదం


➤ శాతవాహనులు మహారాష్ట్రకు చెందినవారని పేర్కొన్నది.


• పి.టి.శ్రీనివాస అయ్యంగార్
• కె.గోపాలాచారి
• డి.పి. సర్కార్


➤ వీరి ప్రకారం శాతవాహనుల జన్మస్థలం, రాజధాని ప్రతిష్టానపురం.


కోస్తాంధ్రవాదం:


➤  శాతవాహనుల తొలి జన్మస్థలం ఆంధ్ర అని పేర్కొన్నది.


• ఆర్.జి. భండార్కర్
• వి.ఎ.స్మిత్
• ఐ.జె. రాప్సస్


➤ వీరి ప్రకారం శాతవాహనుల రాజధాని -ధాన్యకటకం


తెలంగాణవాదం:


➤ శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ అని నిర్ణయించిన చరిత్రకారులు:


1. P.V. పరబ్రహ్మశాస్త్రి ప్రకారం శాతవాహనుల పాలన కోటిలింగాల నుండి ప్రారంభమైనది. కావున వీరు తెలంగాణకు చెందినవారు.


2. కంభంపాటి సత్యనారాయణ శాతవాహనుల పాలన మొదట తెలంగాణలో మొదలై క్రమంగా పశ్చిమ, ఉత్తర, దక్షిణాలకు విస్తరించిందని పేర్కొన్నాడు.


3. శాతవాహన రాజ్యస్థాపకుడి శాసనాలు/నాణేలు కోటిలింగాల వద్ద దొరకడం వల్ల తొలిరాజధాని కోటిలింగాల అని డా.దామెరాజారెడ్డి నిరూపించాడు.


4. జి. రాంబాబు, బి.ఎస్. శాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, శ్రీరామశర్మ మొదలగువారు శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ అని పేర్కొన్నారు.

శాతవాహన చరిత్రకు గల ఆధారాలు
Evidence for Shatavahana history

1) సాహిత్య ఆధారాలు

విదేశీ గ్రంథాలు


➤ గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా (గ్రీకుభాష) గ్రంథంలో “ఆంధ్రులకు మువ్పది కోటలున్న నగరాలున్నాయని, ఒక లక్ష కాల్బలం, రెండు వేల అశ్వకబలం, ఒక వెయ్యి గజదళం ఉన్నట్లు" పేర్కొన్నాడు.


➤ మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో చెప్పిన 30 కోటల్లో తెలంగాణలోని కోటలు : బోధన్, కోటిలింగాల, ధూలికట్ట, పెద్దబంకూర్, కొండాపూర్, ఫణిగిరి, గాజులబండ,ఇంద్రపురి.

➤ ప్లీని యొక్క నాచురల్ హిస్టరీ గ్రంథం మరియు ఒక అజ్ఞాత నావికుడు రాసిన "పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ" అనే గ్రంథాలు శాతవాహనుల విదేశీ వాణిజ్యాన్ని తెలియచేస్తున్నాయి.


స్వదేశీ గ్రంథాలు


* పురాణాలు, బౌద్ధ జాతక కథలు, జైన గ్రంథాలు


(2) శాసనాలు

➤ శాతవాహనులకు సంబంధించి 24 శాసనాలు లభ్యమయ్యాయి. శాతవాహనుల శాసనాలన్నీ ప్రాకృత భాషలో వ్రాయబడ్డాయి. బ్రాహ్మీలిపిని ఉపయోగించారు.

3) నాణేలు


➤ శాతవాహనులు నాణేలను ప్రాకృతం, దేశీ భాషల్లో ముద్రించారు.


➤ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తెలుగు దేశీభాష నుంచే ఉద్భవించినది.


4) త్రవ్వకాలు 

కొండాపూర్-సంగారెడ్డి జిల్లా (పూర్వపు మెదక్ జిల్లా)

➤  క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నాటికే కొండాపూర్ ఒక పట్టణంగా ఆవిర్భవించింది.


➤ శాతవాహనులకు చెందిన సుమారు 4000 నాణేలు కొండాపూర్‌లో దొరికాయి.


➤ కొండాపూరు శాతవాహనుల టంకశాల నగరమని వ్యాఖ్యానించినది - మల్లంపల్లి సోమశేఖరశర్మ.


 ➤ శాతవాహనుల కంటే పూర్వమే కొండాపూర్ 'అశిక' (రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ మాతృకజిల్లాలు) రాజ్యానికి రాజధానిగా ఉండేది.


 ➤ రోమన్ సామ్రాజ్యంతో జరిగే వాణిజ్యానికి దక్షిణాదిన కొండాపూర్ ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది.


➤ కొండాపూర్ లో టైబీరియస్ కైసర్ చిహ్నం గల రోమన్ సెప్టెర్సిస్ తో చేసిన కంఠహారం దొరికింది. 


కోటిలింగాల-జగిత్యాల జిల్లా (పూర్వపు కరీంనగర్ జిల్లా)

➤ ఇది జగిత్యాల జిల్లాలోని గోదావరి, పెద్దవాగు సంగమ స్థానంలో ఉంది.


➤ శాతవాహన సామ్రాజ్యానికి ఇది తొలి రాజధాని.


➤ కోటిలింగాలలో దొరికిన ఇసుక రాతి స్తంభం పై బ్రాహ్మీలిపిలో “నాగగోపినికయ' అని రాయబడిఉంది. 


➤ కోటిలింగాల సమీపంలో గల మునులగుట్ట పై జైనుల శిలాచ్చాదాలను కనుగొన్నారు.


➤ ఇక్కడ శ్రీముఖుడు, తొలి శాతవాహనులు, శాతవాహనుల పూర్వపురాజుల నాణేలు, విద్దంకి నాణేలు కూడా దొరికాయి.


పెద్ద బంకూరు-పెద్దపల్లి జిల్లా (పూర్వపు కరీంనగర్ జిల్లా)


➤ ఇది పెద్దపల్లి జిల్లాలో హుస్సేమియా వాగు ఒడ్డున ఉన్నది.


➤ పెద్ద బంకూరులోని ఒక రైతు పొలంలో 22 వేలకు పైగా ఉన్న శాతవాహనుల నాణేల కుండ దొరికింది.


➤ పెద్దబంకూరులో ఇటుకతో కట్టిన 22 మంచినీటి చేద బావులు, మట్టి గాజులతో నిర్మించిన మరొక బావి బయటపడ్డాయి.


➤ రోమన్ చక్రవర్తులైన అగస్టస్, సీజర్, టైబీరియస్ నాణేలు కూడా దొరికాయి.


ధూళికట్ట - పెద్దపల్లి జిల్లా (పూర్వపు కరీంనగర్ జిల్లా)


➤ ధూళికట్టలో శాతవాహనుల కాలం నాటి బౌద్ధస్థూపాన్ని వి.వి. కృష్ణశాస్త్రి వెలుగులోకి తెచ్చారు.



శాతవాహనుల రాజకీయ చరిత్ర - ముఖ్యరాజులు
Political History of the Shatavahana - Chief Kings


➤ శాతవాహన రాజ్యాన్ని పాలించిన రాజుల సంఖ్య, పాలనాకాలానికి సంబంధించి చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు.


➤ మత్స్యపురాణం ప్రకారం 30 మంది రాజులు సుమారు 456 సంవత్సరాలు పాలించారు.


➤ వాయుపురాణం ప్రకారం 17 మంది రాజులు సుమారు 272 సంవత్సరాలు పాలించారు.


శాతవాహన రాజ్యాన్ని పాలించిన రాజులలో ముఖ్యులు:


శ్రీముఖుడు SriMukha


➤ శ్రీముఖుడు శాతవాహన రాజ్య స్థాపకుడు, అశోకుడికి సమకాలికుడు.


➤ శాసనాలలో ఇతడు 'చిముఖ', సింధుక గా పిలువబడ్డాడు.

వాయుపురాణం - సింధుక

మత్స్యపురాణం - బలిపుచ్చకుడు, బలి


➤ శ్రీముఖుని 8 నాణేలు కోటిలింగాల లో బయల్పడ్డాయి.


➤ దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనంలో "రాయసిముక శాతవాహన సిరిమతో" అని శ్రీముఖుడి గురించి రాయబడింది.


➤ ఇతడు మొదట జైనమతాన్ని స్వీకరించి ఆ తరువాత వైదిక మతంను అనుసరించాడు.


➤ శ్రీముఖుడి పాలనాకాలంలో పేరుపొందిన జైన క్షేత్రం మునులగుట్ట (కరీంనగర్).


➤ శ్రీముఖుడు వేయించిన నాణేలపై గల పేరు - రణగోభద్ర, రణగోస్వామి.


➤ అశోకుడు తన 13 వ శిలాశాసనంలో పేర్కొన్న మౌర్యుల సామంతుడు ఇతడే.


➤ అశోకుడు శ్రీముకునికి రాయ అనే బిరుదును ఇచ్చాడు.


➤ అశోకుడు తన శాసనాలలో శాతవాహనులను సత్యపుత్రులుగా పేర్కొన్నాడు.


➤ శ్రీముఖుడు మహరాష్ట్రలోని రథికుల నాయకుడైన 'మహారథి త్రణకైరో ' ను ఓడించి అతని కుమార్తె 'నాగనిక' ను తన కుమారుడు మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం

జరిపించాడు.


➤ ఇతని క్రూరపాలన వలన ప్రజలు తిరుగుబాటు చేసి ఇతనిని పదవీచిత్యుణ్ణి చేశారని జైనగ్రంథాలు పేర్కొన్నాయి.


➤ శ్రీముఖుడి తదువరి అతని సోదరుడైన కృష్ణుడు రాజయ్యాడు.



కృష్ణుడు/కన్హుడు 


➤ శాసనాలలో ఇతడు  కన్హగా పిలువబడ్డాడు.


➤ శాతవాహనులలో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఇతడు వేయించిన శాసనం  కన్హేరి  శాసనం.


➤ ఇతను నాసిక్, కన్హేరి గుహలను త్రవ్వించాడు, వీటిని బౌద్ధ భిక్షువుల కోసం త్రవ్వించాడు.


➤ నాసిక్ లో బౌద్ధ సన్యానుల సంక్షేమం కోసం 'ధర్మమహామాత్య' అనే అధికారులను నియమించాడు.


➤ కన్హుడు 'భాగవత మతం'ను అవలంభించాడు. ఇతని కాలంలోనే భాగవతమతం ఉత్తరభారతదేశం నుండి దక్కన్లోకి ప్రవేశించింది.



మొదటి శాతకర్ణి

➤ మొదటి శాతకర్ణి శ్రీముఖుని కుమారుడు.


➤ ఇతని భార్య 'నాగానిక' వేయించిన శాసనం 'నానాఘాట్ శాసనం' (ఇది ఒక అలంకార శాసనం).


➤ ఈ శాసనం ప్రాకృతం భాషలో ఉంది.


➤ నానాఘాట్ శాసనం లోని మొదటి శాతకర్ణి బిరుదులు :

• దక్షిణా పథపతి    • అప్రతిహతచక్ర   • ఏకవీర         • శూర


➤ నాగానిక (నాయనిక) తండ్రి పేరు - మహరతి త్రణకయిరో


➤ నానాఘాట్ శాసనంలో నాగానిక 'యజ్ఞ హుతన సుగంధయా దిఘువుత సిందయా' అని తనను తాను వర్ణించుకున్నది.


➤ నానాఘాట్ శాసనంలో ఈ క్రింది ఆరుగురి వ్యక్తుల విగ్రహాలు బయల్పడినవి.

శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, నాగానిక,మహారథి త్రణకైరో  వేదక్ష శాతకర్ణి, శతశ్రీ (మొదటి శాతకర్ణి కుమారులు)


➤ పురాణాల ప్రకారం మొదటి శాతకర్ణి బిరుదులు

  • మహన్                • మల్లకర్ణ (మత్స్యపురాణం)

➤ నానాఘాట్ శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి రెండు అశ్వమేధయాగాలు, ఒక రాజసూయ యాగంతో పాటు 20 ఇతర క్రతువులను చేశాడు.


➤ బ్రాహ్మణులకు అనేక అవులు, గుర్రాలు, ఏనుగులు, గ్రామాలను దానంగా ఇచ్చాడు.


➤ భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానాలు చేసిన రాజు మొదటి శాతకర్ణి 

➤ ఇతను "అశ్వమేద నాణేలు' వేయించాడు.


➤ ఇతని నాణేల పై ఏనుగు గుర్తు, ఉజ్జయిని పట్టణం గుర్తు కలదు.


➤ మొదటి శాతకర్ణికి సమకాలీన భారతదేశ రాజులు.


  • మగధ రాజ్యం - పుశ్యామిత్ర శుంగుడు


  • కళింగ రాజ్యం (ఒరిస్సా) - ఖారావేలుడు


  • వాయువ్య భారతదేశం-డేమిత్రియాస్(ఇండో-గ్రీక్ రాజు)


➤ పుష్యమిత్ర శుంగుని పై విజయానికి గుర్తుగా 'ఉజ్జయిని తోరణం' గల నాణెములను ముద్రించాడు.


➤ మొదటి శాతకర్ణి కాలంలో శాతకర్ణి రాజ్యంలోని మూషిక నగరిపై దాడిచేసిన కళింగ రాజు - ఖారావేలుడు


➤ ఈ విషయం తెలియచేయు శాసనం : ఖారవేలుడి హథిగుంఫా శాసనం


➤ ఖారావేలుడు వితుండ నగరాన్ని గాడిదలతో దున్నించినట్లుగా, మూషిక నగరంను జయించి మూషికాధిపతి అనే బిరుదును పొందినట్లు హాథిగుంఫా శాసనం ద్వారా తెలుస్తుంది.


➤ హథిగుంపా శాసనంలో పేర్కొన్న మూషిక నగరం ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ అని, పితుండ నగరం ప్రస్తుత గుంటుపల్లి అని చరిత్రకారుల అభిప్రాయం.


➤ కాని మొదటి శాతకర్ణి కళింగ 'ఖారావేలునిపై' దండెత్తి ఓడించి తన సామ్రాజ్యంను తూర్పువైపుకు విస్తరించినట్లుగా 'చుళ్ళకళింగ జాతకం' ద్వారా తెలుస్తుంది.


నోట్: 2011 మే లో కోటిలింగాల దగ్గర మొక్కట్రావ్ పేట గ్రామ శివారులో దొరికిన శిలాశాసనం ప్రకారం హకుశ్రీ అనే శాతవాహనుడు మొదటి శాతకర్ణి - నాగానికల కుమారుడిగా పేర్కొనబడ్డాడు.


➤ శాతకర్ణి మరణానంతరం అతని భార్య నాగానిక అతని కుమారునికి యుక్త వయస్సువచ్చే వరకు పాలనా భాద్యతలు చేపట్టినది.


స్కందస్తంబి 


➤ ఇతని కాలంలో గ్రీకుల దండయాత్రలు ప్రారంభం అయ్యాయి.



రెండవ శాతకర్ణి


➤ ఇతను 'సాంచీ స్థూపానికి' దక్షిణ తోరణం నిర్మించాడు.


➤ శాతవాహన రాజులలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు - రెండవ శాతకర్ణి (56 సంవత్సరాలు)


➤ ఇతని కాలంలోనే శాతవాహన సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలోకి వ్యాప్తి చెందినది.


➤ గార్గి సంహిత ప్రకారం ఇతను శుంగుల రెండవ రాజధాని 'విదిశ'ను జయించాడు.


➤ ఇతడు ఉత్తరభారతదేశంలోని మగధ రాజధాని అయిన పాటలీపుత్రాన్ని జయించాడు.


➤ ఇతని కాలం నుండి శక-శాతవాహన ఘర్షణ ప్రారంభమైంది.


➤ ఇతని ఆస్థాన కళాకారుడు - వశిష్ఠపుత్ర ఆనంద



కుంతల శాతకర్ణి



➤ ఇతను 13వ చక్రవర్తి


➤ ఇతడు ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికారభాషగా మార్చాడు.


➤ కుంతల శాతకర్ణి బిరుదు - విక్రమార్క 


ఇతని ఆస్థానంలోని ప్రసిద్ధ కవులు - వారి రచనలు:


• గుణాఢ్యుడు- బృహత్కథ (పైశాచీ ప్రాకృతంలో రాసాడు)


• శర్వవర్మ - కాతంత్ర వ్యాకరణం


• వాత్సాయనుడు - కామసూత్ర, న్యాయభాష్యం


➤ కుంతల శాతకర్ణి వివాహమాడిన ఉత్తర భారతదేశపు రాకుమార్తె - మళయావతి


➤ సంస్కృత భాష రాక తన భార్యచేత అవమానించబడ్డ కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పించినవాడు - శర్వవర్మ


➤ శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని వ్రాసాడు. రాజు ఈ గ్రంథం ద్వారానే సంస్మృతాన్ని అభ్యసించాడు.


➤ గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో రాసిన తన బృహత్కథ గ్రంథంను కుంతల శాతకర్ణికి అంకితమివ్వదానికి ప్రయత్నించగా రాజు తిరస్కరించడంతో గుణాధ్యుడు తన గ్రంథాన్ని కాల్చివేసాడు.


➤ ప్రస్తుతం బృహత్కథలో ఒకే ఒక లంబకం (చాప్టర్ ) అందుబాటులో ఉంది.


➤ బృహత్కథలో కథానాయకుడు - లబ్బీకుడు / కుబేరుడు


➤ బృహత్కథ ఆధారంగా 10, 11 శతాబ్దాలలో 4 సంస్కృత గ్రంథాలు రాయబడ్డాయి. అవి:


1. సోమదేవుడి - కథాసరిత్సాగరం

2. క్షేమేంద్రుడి - బృహత్కథా మంజరి

3. హరిసేనుడి - బృహత్కథా కోశం

4. వరాహమిహురుడు - బృహత్ సంహిత


➤ గుణాడ్యుడి బృహత్కథను సంస్కృతంలోకి అనువాదం చేసినవాడు - గాంగవంశీయుడైన దుర్వినుతుడు.


➤ ఈ బృహత్కథ గ్రంథం ఆధారంగానే విష్ణుశర్మ పంచతంత్రాన్ని రచించాడు.

➤ శర్వవర్మ, గుణాడ్యుఢి మధ్య విభేధాలు ఉండేవని సోమదేవుడి కథాసరిత్సాగరం తెలియజేస్తుంది.


➤ వాత్సాయనుడి కామసూత్ర గ్రంథం ప్రకారం కుంతల శాతకర్ణి తన భార్య మళయవతిని కరిర్త అను శృంగార భంగిమలో హతమార్చాడు.


➤ కామసూత్రను తెలుగులోకి అనువదించినది - ఆది నారాయణ శాస్త్రి



మొదటి పులోమావి



➤ ఇతను 15వ చక్రవర్తి


➤ ఇతడు ఉత్తర భారతదేశంలోని మగధపై దండెత్తి కణ్వ చక్రవర్తి సుశర్మను చంపి కణ్వవంశాన్ని అంతమొందించాడు.


➤ మొదటి వులోమావికి సంబంధించిన నాణెములు పాటలీపుత్ర (బీహార్) సమీపంలోని కుహ్రమ / కుహరం వద్ద లభించాయి.



గౌరవ కృష్ణుడు:


➤ ఇతను ఆంధ్ర సామ్రాజ్య విచ్చిన్నతకు కారకుడయ్యాడు. దాంతో పురాణాలు ఇతడిని రిక్తవర్ణుడు, అరిష్టకర్ముడు, వైకృష్ణుడు అని కించపరిచాయి.



హలుడు


➤ ఇతను 17వ చక్రవర్తి, కేవలం అయిదేళ్ళే పాలించాడు.


➤ ఇతను తెలంగాణ 'మొదటి లిఖిత కవిరాజు'


➤ ఇతని కాలమును 'ప్రాకృతంలో స్వర్ణయుగం' గా పేర్కొంటారు.


➤ హలుడు మహారాష్ట్రీ ప్రాకృతంలో 'గాథాసప్తశతి' అనే గ్రంథాన్ని రచించాడు.


➤ ఇందులోని 700 శృంగార, ప్రేమ కవితలు అప్పటి గ్రామీణ సామాజిక పరిస్థితులను వివరించాయి.


➤ తమలపాకులను, పారాణీ ప్రత్యేకతను, వివాహ సాంప్రదాయాలను, వసంతోత్సవాన్ని (హోలి), మదనోత్సవాన్ని ఈ గ్రంథం వివరిస్తుంది.


➤ గాథాసప్తశతి, శ్వేతంభర జైనుడైన జయవల్లభుని 'వజ్జలగ్గ' అనే గ్రంథాన్ని పోలి ఉంటుంది.


➤ గాథాసప్తశతిని హలుడు రాసినట్లుగా బాణుడు తన హర్షచరిత్ర గ్రంథంలో పేర్కొన్నాడు.


➤ హలుడికి 'కవిరాజు', 'కవి వత్సలుడు' అనే బిరుదులు కలవు.


➤ కుతూహలుడి 'లీలావతి పరిణయం' అనే గ్రంథంలో హలుడు సింహళం (శ్రీలంక) పై దాడిచేసి, సింహళ రాకుమారి లీలావతిని వివాహం చేసుకున్నాడని తెలిపాడు.


➤ హలుడు, లీలావతి వివాహం సప్త గోదావరి దగ్గర భీమేశ్వర సన్నిధిలో జరిగినట్లు లీలావతి పరిణయం గ్రంథంలో పేర్కొన్నారు.


➤ డా|| సంగనభట్ల నర్సయ్య ప్రకారం ఈ ప్రాంతం జగిత్యాల జిల్లా వేంపల్లి వెంకటరావు పేట దగ్గర గోదావరి తీరంలో ఉన్న భీమేశ్వరాలయం.


➤ హలుడిచే సన్మానం పొందిన కవులు - కుమారిలుడు,శ్రీపాలితుడు


➤ హలుడు యొక్క ప్రముఖ సేనాపతి - విజయనాదుడు.



గౌతమీపుత్ర శాతకర్ణి Goutamiputhra Satakarni

Goutamiputra Satakarni



➤ గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనులందరిలో గొప్పవాడు.పురాణాల ప్రకారం ఇతను 23వ రాజు.


➤ ఇతను శాతవాహనుల రాజకీయ వైభవాన్ని పునరుద్ధరించాడు.


➤ ఇతను అధికారంలోకి రావడంతో “క్రీ.శ 78లో శాలివాహన శకం" ప్రారంభమైంది.


➤ 1957 నుండి భారత ప్రభుత్వం క్రీ.శ 78వ సం||ను అధికారంగా శాలివాహన శకారంభ సంవత్సరంగా పాటిస్తున్నది.


➤ గౌతమీపుత్ర శాతకర్ణి ప్రకటించిన శాలివాహన శకంను పాటించిన ఏకైక రాజు - యాదవ రామచంద్ర దేవుడు (దేవగిరి రాజు)


➤ పేరుకు ముందు తల్లి పేరుని తెలియజేసే మాతృసంజ్ఞను వాడిన మొదటి శాతవాహనరాజు గౌతమీపుత్ర శాతకర్ణి.


➤ ఇతని తల్లి గౌతమీ బాలశ్రీ' వేయించిన శాసనం నాసిక్ శాసనం


➤ ఈ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి మరణానంతరం అతని కుమారుడు వాశిష్టీపుత్ర పులోమావి 19వ పాలనా సంవత్సరంలో వేయబడింది.


➤ గౌతమీ బాలశ్రీ నాసిక్ ప్రశస్తిలో తనను తాను 'సత్యవచనదాన అహింసా నిరతయా', 'రాజర్షి వధువు' గా వర్ణించుకుంది.


నాసిక్ శాసనం ప్రకారం గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు:


* ద్విజకుల వర్ధన

* చాతుర్వర్ణ సంకర 

* క్షత్రీయ దర్పమానవర్ధన

* అగమనిలయ

* వర్ణ సాంకర్య నిరోధక

* ఏకశూర 

* ఏకధనుర్ధనుడు

* శకయవన పహ్లావ నిఘాదనుడు

* ఏకబ్రాహ్మణ

* బెణకటక స్వామి

* రాజోరణ్ అనే సార్వభౌమ బిరుదు

* త్రిసముద్రతోయ పీతావాహన (3 సముద్రాల నీరు తాగిన గుర్రాలు కలవాడు)

* క్షహరాట వంశ నిర్వశేషకార


జోగల తంబి యుద్ధం:


➤ జోగల్ తంబి యుద్ధంలో గౌతమీపుత్ర శాతకర్ణి క్షహరాట వంశీయుడైన నహపాణుడిని ఓడించి క్షహరాటవంశ నిర్వశేషకార అనే బిరుదాన్ని పొందాడు.


➤ జోగళ తంబి యుద్ధంలో విజయం సాధించిన గౌతమీపుత్ర శాతకర్ణి, నహపాణుని నాణేలపై తన పేరును పునర్ ముద్రించుకున్నాడు.


➤ ఈ పునర్ముద్రిత నాణేలు మహరాష్ట్రలోని జోగల్ తంబి వద్ద లభించాయి.


➤ గౌతమీపుత్ర శాతకర్ణి అనేక రాజ్యాలను జయించాడు. రాజధానిని ధాన్యకటకం నుండి ప్రతిష్టానపురం కు మార్చాడు.


➤ గౌతమీపుత్ర శాతకర్ణి భేనకటకము అనే నగరాన్ని నిర్మించారు.


➤ ఇతనికి సంబంధించిన నాణేలు కడలూరు (తమిళనాడు)లో కూడా లభించాయి.


➤ గౌతమీపుత్ర శాతకర్ణి 100 నివర్తనముల భూమిని బౌద్ధ బిక్షువులకు దానం చేశాడు.



వాశిష్టీపుత్ర పులోమావి (VPP) / పులోమావి-2

➤ నాసిక్ శాసనంలో ఇతడు దక్షిణా పథేశ్వరుడిగా కీర్తించబడ్డాడు.


➤ ఇతని కాలంలోనే ప్రముఖ అమరావతి స్థూపం నిర్మించబడింది


➤ ఇతని ధరణి కోట శాసనం ఆంధ్రప్రదేశ్లో లభించిన మొట్టమొదటి శాతవాహనుల శాసనం


➤ వాశివ పుత్ర పులోమావి కార్గమక పంశస్తుడైన రుద్రదమనుడి చేతిలో ఓడిపోయాడు.


➤ రుద్రదమనుడికి భయపడి VPP రాజధానిని ప్రతిష్టానపురం నుండి ధాన్యకటకమునకు మార్చాడు.


➤ ఈ విషయాన్ని తెలియజేయు రుద్రదాముడి శాసనం-జునాఘడ్/గిర్నార్ శాసనం 


➤ VPP బిరుదు - నవనగరస్వామి



వాశిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి

➤ ఇతడి బిరుదు - క్షత్రప


➤ ఇతడు శాతవాహనులలో మొదటిసారిగా ద్విభాషా నాణెములు (ప్రాకృతం - తమిళం) ముద్రించాడు .



యజ్ఞశ్రీ  శాతకర్ణి


➤ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క శాసనం - చినగంజాం


➤ ఇతను 'రెండు తెరచాపలున్న ఓడ బొమ్మ నాణెములు' ముద్రించాడు.


➤ ఈ నాణెములను బట్టి ఇతనికాలంలో రోమ్ దేశంతో పెద్దఎత్తున వర్తకం జరిగినట్లు తెలుస్తున్నది.


మత్స్యపురాణం ఇతని కాలంలో రచించబడిందని చరిత్రకారుల భావన.


➤ భానుడు తన హర్షచరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని 'త్రిసముద్రాధిపతి' గా ప్రస్తావించాడు.


శిలప్పాధికారం అనే గ్రంథం యజ్ఞశ్రీ శాతకర్ణిని “పాసండసత్తాన్' అనే పేరుతో వ్యవహరించింది.


పాసండసత్తాన్ అనగా అర్థం యజ్ఞయాగాదులను వ్యతిరేకించేవాడు.


➤ ఇతని సమకాలీకుడైన గొప్ప బౌద్ధమతాచార్యుడు - ఆచార్య నాగార్జునుడు


➤ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునిడి కోసం శ్రీ పర్వతం (నాగార్జునకొండ) వద్ద నిర్మించిన విహారం - పారావత విహారం / మహాచైత్య విహారం


➤ చైనా యాత్రికుడు ఫాహియాన్ ప్రకారం ఈ విహారంలో 5 అంతస్థులు, 1600 గదులు కలవు.



3వ పులోమావి


➤ శాతవాహన చక్రవర్తులలో చివరివాడు - 3వ పులోమావి


➤ 3వ పులోమావి గురించి మరియు శాతవాహన రాజ్య

పతనం గురించి వివరించే శాసనం - మ్యాకదోని శాసనం(బళ్ళారి - కర్ణాటక)



శాతవాహనుల పరిపాలన 
Administration of the Shatavahana

➤ శాతవాహనులు మౌర్యుల పరిపాలన విధానాన్ని అనుసరించారు.


➤ తండ్రి నుండి కుమారునికి రాజ్యం వంశపారంపర్యంగా సంక్రమించేది.


ధర్మశాస్త్ర సమ్మతమైన రాచరిక విధానం శాతవాహన రాజ్యవ్యవస్థకు మూలం.


➤ శాతవాహనుల పరిపాలన మరియు మంత్రిమండలి గురించి 'జునాఘడ్ శాసనం'లో పేర్కొన్నారు


➤ రాజుకు సలహాలిచ్చుటకు నలుగురు ప్రధానమైన మంత్రులు ఉండేవారు.


➤ వీరిని అమాత్యులు అంటారు. అమాత్యులకు వంశపారంపర్య హక్కులేదు.


• విశ్వసామాత్యుడు - రాజుకు విశ్వాసపాత్రుడు,అంతరంగిక సలహాదారుడు. ఇతను ప్రధానమంత్రి

• రాజా అమాత్య - రాజు ఆదేశాలను అమలుపరిచేవాడు

• మహా అమాత్య - ఆర్థికమంత్రి

• మహా తలవరి - ప్రధాన సేనాపతి


➤ వీరితోపాటు అనేక మంది అధికారులు ఉండేవారు. వారిలో ముఖ్యమైనవారు:


హిరణిక - కోశాధికారి (పన్ను వసూలు చేయువాడు)

భాండారీకుడు - వస్తు సంచయిక అధికారి

మహాతలవర - అంగరక్షకుడు

ప్రతీహార - ద్వారపాలకుడు

రజ్జగాహకుడు - క్షేత్రస్థాయిలో భూమిని సర్వేచేసి, శిస్తు

వసూలు చేయు అధికారి.

రజుక - న్యాయమూర్తి

మహాధార్మిక- విద్య,మతపర  వివాదాలను పరిష్కరించేవాడు.

మహాఆర్యక-న్యాయపర వివాదాలను పరిష్కరించేవాడు.

పట్టకపాల - భూమిపత్రాలు రాసేవాడు .

రాజవిజ  - ఆస్థానవైద్యుడు .


➤ శాతవాహనుల కాలంలో భూదానాలు 'అక్షయనివి' అనే షరతులతో చేసేవారు. అనగా శాశ్వతంగా ఇచ్చేయడం.


రాజ్య విభజన - పరిపాలకులు

                                   రాజ్యం           - రాజు 

                                   ఆహారములు     - అమాత్య

                                   విషయాలు      - విషయపతి

                                  గ్రామాలు          - గ్రామీణి/గ్రామిక


స్థానిక పాలన - గ్రామం


➤ శాతవాహనుల పాలనా విభాగంలో చిన్నది - గ్రామం


➤ గ్రామాలలో పాలనా అధికారిణిని గ్రామిణి / గ్రామిక అనేవారు.


➤ గ్రామ సమస్యల పరిష్కారం కొరకు 'మహాకార్యక' అనే అధికారి ఉండేవాడు.


➤ అనేక గ్రామాలను కలిపి గుల్మి అనేవారు. గుల్మి అధిపతిని 'గుల్మికుడు' అనేవారు.


➤ గుల్మికులు సరిహద్దు ప్రాంత రక్షణకు సైన్యాధిపతులుగా కూడా ఉండేవారు. వీరి గురించి పేర్కొన్న శాసనం - మ్యాకధోని శాసనం


పట్టణ పాలన


➤ పట్టణ పాలనను నిర్వహించేది - నిగమసభలు


➤ నిగమ సభలోని సభ్యులు - గహపతులు. కులపెద్దలను గహపతులు అనేవారు.


➤ శాతవాహన కాలంనాటి పట్టణ పాలనను గురించి తెలియచేయు శాసనం - భట్టిప్రోలు నిగమసభ శాసనం


➤ ఈ శాసనం వేయించినది కుబేరుడు.


➤ నిగమసభల గురించి 'ఇండికా' లో కూడా పేర్కొన్నారు.


➤ రాజు యొక్క ప్రత్యక్ష పాలనలో ఉండే ప్రాంతం రాజకంఖేట



సైనిక వ్యవస్థ

Military System in Shatavahana

➤ ఖారావేలుని హతిగుంఫా శాసనంలో శాతవాహనుల 'చతురంగ బలలా' ప్రస్తావన ఉంది.


➤ శాతవాహనుల సైన్యంలో రథ, గజ, అశ్విక, పదాతి దళములతో కూడిన చతురంగ బలాలు ఉండేవి.


స్కందగారం -తాత్కాలిక సైనిక శిబిరం (మిలటరీ క్యాంప్)


కటకం - శాశ్వత సైన్యాగారం (నేటి కంటోన్మెంట్)



ఆర్ధిక వ్యవస్థ
Economy of Shatavahana

➤ శాతవాహన కాలంలో ప్రజల ప్రధాన వృత్తి - వ్యవసాయం


➤ పంట పొలాలు వందే క్షేత్రాలను సీతక్షేత్రాలు అని, వ్యవసాయ పర్యవేక్షణ అధికారిని 'సేతాధ్యక్ష' అనేవారు


➤ వీరి కాలంలో భూమి కొలత యూనిట్ నివర్తనాలు గా ఉండేది.


1 నివర్తనం -1 1/2 ఎకరాలకు సమానం


➤ రాజ్యానికి ప్రధాన ఆదాయం - భూమిశిస్తు


➤ భూమి శిస్తును భాగ / దేయమేయ అని పిలిచేవారు


➤ దేయ - ధనరూపంలో వసూలు చేసుకునే శిస్తు


➤ మేయ - ధాన్య రూపంలో వసూలు చేసుకునే శిస్తు


➤ భూమి శిస్తు సాధారణంగా పంటలో 1/6 వంతు మేరకు వసూలు చేసేవారు.


➤ చేతి వృత్తుల వారిపై విధించే పన్ను - కురుకర


➤ శుల్క - నీటి తీరువ పన్ను


➤ కర- కూరగాయలపై పండ్ల తోటలపై పన్ను


➤ భూదానాలు పొందిన బ్రాహ్మణులు, బౌద్ధ బిక్షువులు అన్ని పన్నుల నుండి మినహాయింపు పొందేవారు.


➤ శాతవాహన రాజులు ఆధునిక వ్యవసాయ పనిముట్లు తయారు చేయుటకు ఏర్పాటుచేసిన సాంకేతిక నిపుణుల సంఘం- ఓదయాంత్రిక


➤ ఓదయాంత్రిక రూపొందించే పనిముట్లు


ఉదగ యంత్రం- భూమిని దున్నే యంత్రం

ఘటి యంత్రం - నీటిని పైకి లాగడానికి ఉపయోగించే

యంత్రం.

గరిక యంత్రం - ముడి ప్రత్తి నుండి విత్తనాలు వేరుచేయు

పరికరం.

* రిహత్త గడియ - నీటిని తోడు పరికరం



నీటిపారుదల irrigation system in Shatavahana


ఉపాదన-బావులు


తడగ- చెరువు


రహత్త గడియ-లిఫ్ట్ ఇరిగేషన్


పానియ గహారిక - ఇరిగేషన్ ఆఫీసర్


➤ రైతులలో రెండు వర్గాల వారు ఉండేవారు.


1.హలికులు - చిన్న, సన్నకారు రైతులు


2 గహపతి/సంసారిన్-పెద్ద రైతులు, జమిందారీలాంటివారు


శాతవాహనుల కాలం నాటి ప్రధాన పంటలు: Mazor crops in Shatavahana Period

➤ వరి, చెఱకు, పసుపు, గోధుమలు, పత్తి,జనుము

➤ కొబ్బరి (క్రీ.శ 1వ శతాబ్దంలో మలియాదేశం నుండి

కొబ్బరి దక్షిణ భారత్ లోకి ప్రవేశించింది)


శ్రేణులు/వృత్తి సంఘాలు:

➤ శాతవాహనుల కాలంలో ఆయా వృత్తుల వారు శ్రేణులుగా

ఏర్పడేవారు. శ్రేణికి అధ్యక్షుడు శ్రేష్టి


➤ ఈ శ్రేణి సంఘాలే తర్వాత కాలంలో కులాలుగా ఏర్పడ్డాయి


➤ శాసనాల ప్రకారం శాతవాహనుల కాలంలో 18 రకాల

శ్రేణులు / వర్తకసంఘాలు ఉన్నట్లు ఆధారాలు కలవు.


1) కోలిక శ్రేణి - నేతపనివారు

2) హలికులు - వ్యవసాయదారులు

3) తలిపిస్థికులు - నూనెతీసేవారు

4) కులరిక - కుమ్మరివాళ్ళు

5) ఉదయాంత్రిక - నీటి యంత్రాలు నడుపువారు

6) గంధిక - సుగంధ పరిమళాలు తయారు చేసేవాళ్ళు 

7) వధకులు - వడ్రంగులు

8) కాసాకారులు - ఇత్తడి పనివారు

9) తెసకారులు - మెరుగు పెట్టేవారు

10) కమారులు - కమ్మరులు

11) మాలాకారులు - పూల వర్తకులు

12) లోహవాణియలు - ఇనుపవర్తకులు

13) సువణకారులు - సువర్ణకారులు

14) సేలవధకులు - రాతి పనివారు

15) అవేసినులు - చేతి వృత్తులవారు

16) లేఖకులు - రాతగాళ్ళు

17) చమ్మకారులు - చర్మ కారులు

18) పసకరులు -మేదరివారు


➤ ఈ శ్రేణులు నేటి బ్యాంకుల కార్యకలాపాలను కూడా నిర్వహించేవి. అవి డిపాజిట్లను తీసుకునేవి, అప్పులను కూడా ఇచ్చేవి.  


➤ ఈ కాలంలో సాధారణంగా సంవత్సరానికి 12 శాతం వడ్డీ ఉండేది. 


ఋషభదత్తుడి నాసిక్ అనే ప్రాంతంలో వేయించిన శాసనం ప్రకారం గోవర్ధన హారంలోని కోలిక శ్రేణి వారి నుండి ఋషభదత్తుడు 12% వడ్డీతో 2000 కర్షాపణములను అప్పుగా తీసుకొని తిరిగి వడ్డీతో చెల్లించగా కోలిక శ్రేణి ఆ మొత్తాన్ని బౌద్ధ భిక్షువులకు దానంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.


 ➤ శాతవాహన రాజ్యంలో వూజ్ అనే ఉక్కు తయారయ్యేది. దీనికి సంబంధించిన ఆధారాలు మెదక్ జిల్లాలోని కొండాపూర్‌లో కొలిమితిత్తులు బయటపడ్డాయి.  


➤ కోటిలింగాలలో స్వర్ణకారుల కొలిమి బయటపడింది. 


 ➤ శాతవాహనుల రాజ్యం ఆర్థికంగా బలంగా ఉండటానికి ముఖ్యకారణం - కోలికుల శ్రేణి (పద్మశాలీలు)  


➤ వాశిష్టపుత్ర పులోమావి కాలంలో రక్కసి లోటయ్ అనేవాడు  పత్తి నుండి విత్తనాలను తీసి, దూది తయారుచేసే 'గిరిక' యంత్రాన్ని కనుగొన్నాడు.  


➤ ఈ గిరిక యంత్రం వలన తక్కువ కాలంలో ఎక్కువ దూదిని తీయడం వల్ల బట్టల తయారీ సులభమై బట్టలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడింది. 


➤  ఈ కాలం నాటి సన్నని ఆకర్షణీయమైన వస్త్రాలను రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి చేసేవారు.  ఈ సన్నని వస్త్రాలను ధరించిన స్త్రీలను చూసి రోమన్ సామ్రాజ్యంలోని పురుషులు ఆకర్షితం కావడం వల్ల రోమన్ సామ్రాజ్యంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని “ప్లీని' అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.



వర్తకం Trade system in Shatavahana


➤ వర్తక వ్యాపారం వస్తుమార్పిడి (బార్టర్ విధానం) పద్దతిలో జరిగేది


➤ వర్తక సంఘాలు పంచ్ మర్కుడ్ కాయున్స్ ను ముద్రించేవి 


 ➤ శాతవాహనుల కాలంలో దేశీయ, విదేశీ వాణిజ్యం విరివిగా జరిగేది.


➤ స్వదేశి వర్తకులను సేధి అని పిలిచేవారు.


➤ శాతవాహనుల కాలంలో ప్రధాన ప్రయాణ సాధనం- ఎడ్లబండి


➤ వర్తకులు సుదూర ప్రాంతాలలో వ్యాపారం చేసే సమయంలో దొంగలను ఎదుర్కొనేందుకు బిడారులుగా ఏర్పడి ప్రయాణం సాగించేవారు


➤ శాతవాహన కాలంలో తెలంగాణలోని కోటిలింగాల, ధూళికట్ట, కొండాపూర్ ప్రధానమైన వర్తక కేంద్రాలుగా ఉండేవి.


➤ విదేశీ వర్తకం చేయువారిని సార్థవాహకులు' అనేవారు.


శాతవాహనుల కాలంనాటి విదేశీ వ్యాపారం, ప్రముఖ రేవు పట్టణాల గురించి తెలియజేయు గ్రంథాలు:Texts on foreign trade and major port cities of the Shatavahana period


1. ఒక అజ్ఞాత నావికుడు రాసిన 'పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్సే' గ్రంథం. ఈ గ్రంథం పుదుచ్చేరి (TN) కి సమీపాన ఉన్న అరికమేడు ను అంతర్జాతీయ ఓడరేవు పట్టణంగా పేర్కొన్నది. 


2. టాలమీ రాసిన 'దిగైడ్ టూ జాగ్రఫి' గ్రంథం 


3.ప్లీనీ రాసిన 'నాచురల్ హిస్టరీ' గ్రంథం.


➤ అత్యంత పలుచని మల్లసెల్లాలు అను వస్త్రాలను రోమన్ మహిళలు శాతవాహన రాజ్యం నుండి దిగుమతి చేసుకుంటున్నారని, ఈ వస్త్రాలకు బదులుగా 5 కోట్ల స్టెర్లింగ్ రోమన్ బంగారు నాణేలు ఆంధ్రదేశానికి తరలివెళ్తున్నాయని ప్లీని పేర్కొన్నాడు.


➤ శాతవాహనుల కాలంలో పశ్చిమతీరంలోని ముఖ్యరేవు పట్టణాలు :


బరుకచ్ఛ (బరిగజ) - ఇదే నేటి బ్రోచ్ (గుజరాత్)


• కళ్యాణ్ - కర్ణాటక


• సోపార - మహారాష్ట్ర


➤ తూర్పుతీరంలో ముఖ్యమైన ఓడరేవు - మైసోలియా (మోటుపల్లి)


➤ శాతవాహన కాలంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు: 


గూడూరు ప్రాంతం - సన్నబట్టలకు 

మచిలీపట్నం - మస్లిన్/రవ శేల్లాలు 

పల్నాడు - వజ్రాల పరిశ్రమ 

వినుకొండ - లోహ పరిశ్రమ 

కోనసముద్రం (కరీంనగర్) - మంచి నాణ్యత కలిగిన అనుము


శాతవాహన కాలం నాటి ఎగుమతులు: Exports during the Shatavahana period


• సన్నని వస్త్రాలు, నూలు బట్టలు (మస్లిన్ ) 


• బంగారు కుర్చీలు, శంఖువులు, రత్నాలు, ముత్యాలు


• ఏనుగు దంతపు వస్తువులు, బొమ్మలు


• సుగంధద్రవ్యాలు, వనమూలికలు, చందనం చెక్కలు


• చక్కెర, నూనె, నెయ్యి


• బానిస స్త్రీలు, విలాస వస్తువులు


➤ శాతవాహనుల దిగుమతి చేసుకునే వస్తువులు: Imported goods of Shatavahana


• బంగారం, పగడాలు, కర్పూరం, సిల్కు


నాణేలు


➤ రోమ్ దేశంతో జరిగిన వర్తకం వల్ల ఆంధ్ర, తెలంగాణలో అనేక ప్రదేశాలలో రోమన్ నాణేలు లభించాయి.


పెద్దబంకూరులో అగస్టస్, టైబీరియస్ చిహ్నాం ఉన్న నాణేలు బయటపడ్డాయి.


నల్లగొండ - గుతిపర్హి లో క్లాడియస్ చక్రవర్తి నాణేలు. 


➤ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గుటిపర్హి, ఏలేశ్వరం, అక్కెనపల్లిలో వెండి మరియు బంగారు నాణేలు, ఖమ్మంలోని నాగవరప్పాడులో రోమన్ బంగారు నాణేలు కుప్పలుగా దొరికాయి.


➤ తమిళనాడులో అరికమేడు (పాండిచ్చేరి సమీపంలో) వద్ద రోమన్ బంగారు నాణేలు దొరికాయి. అరికమేడు రోమన్ వర్తక కేంద్రం.




➤ శాతవాహనులు అధికంగా సీసం నాణేలు,ఫొటీన్ మిశ్రమ లోహ నాణేలు, వెండి, బంగారు నాణేలు ముద్రించారు. 


➤ సీసం నాణేలు అధికంగా ముద్రించబడ్డాయి. 


➤ శాతవాహనుల బంగారు నాణెం - సువర్ణం


➤ శాతవాహనుల వెండి నాణెం - కర్షాపణం 


➤ ఒక సువర్ణం = 36 కర్షాపణాలకు సమానం



సామాజిక పరిస్థితులు
Social Conditions of Shatavahana


➤ శాతవాహన సమాజంలో మిశ్రమ సంస్కృతి (Composite Society) కనిపిస్తుంది. అంటే ద్రవిడ సంస్కృతి + ఆర్య సంస్కృతి


శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది కాని దాని తీవ్రత కఠినంగా ఉండదు.


➤ కులవ్యవస్థ కఠినంగా లేకపోవడం వలన కులాంతర వివాహాలు జరిగేవి.


➤ బ్రాహ్మనులకు ఉన్నతమైన స్థానం ఉండేది.


➤ చేతివృత్తుల నుండి వర్తక సంఘాల నుండి కులవ్యవస్థ ఆవిర్భవించింది. కానీ కులవివక్ష లేదని చెప్పవచ్చు.


➤ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమలులో ఉండేది. పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది.


➤ స్త్రీకి పూర్తి స్వేచ్చ స్వాతంత్రాలు కలవు


➤ మహిళలకు ఆస్తిహక్కు కల్పించబడింది. మత స్వేచ్ఛ కూడా కల్పించారు.


➤ స్త్రీలు పురుషులతో పాటు యజ్ఞాలలో పాల్గొనేవారు.


➤ కానీ వీరి కాలంలో సామాజిక వ్యవస్థలో బహుభార్యత్వం,సతీసహగమనం వంటి దురాచారాలు ఉన్నాయి.


➤ వితంతు వివాహాలు లేవు. ఆనాటి సమాజంలో వివాహ వ్యవస్థను గౌరవించేవారు. వేశ్యవృత్తికి కూడా గౌరవం ఉండేది.


➤ శాతవాహన కాలం నాటి సతీసహగమన వ్యవస్థ గురించి పేర్కొన్న విదేశీ యాత్రికుడు - స్ట్రాబో


➤ శాతవాహన కాలం నాటి నాట్యకత్తెలు అరదళం అనే మైపూతను వాడేవారు.


➤ స్త్రీలు రవికలు ధరించకుండా కబరి బంధాలు ధరించేవారు. 


➤ స్త్రీ, పురుషులు ధరించే తలపాగను 'ఉష్ణీయం' అనేవారు.


 ➤ వీరి కాలంలో బానిస వ్యవస్థ ఉండేది.


కామసూత్ర గ్రంథం ప్రకారం శాతవాహనుల కాలం నాటి పండుగలు:


• మదనోత్సవం 

• కౌముది యాగం

• ఘటానిబంధన 

• హాలక, ఉద్యానవన పండుగలు 


➤ వీరు ఉపయోగించిన సంగీత పరికరాలు:


• వేణువు, వీణ, శంఖం, మృదంగం 



మతపరిస్థితులు 
Religious Conditions of shatavahana


➤ శాతవాహనులు అవలంభించిన మతం - వైదిక మతం 


 ➤ శాతవాహనుల కాలంలో వైదిక, బౌద్ధ, జైన మతాలు విలసిల్లాయి.


1) వైదికమతం


నానాఘాట్ శాసనం ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలగు వైదిక దేవుళ్ళ గురించి ప్రస్తావించింది. ఈ శాసనం ఇంద్రుడిని ప్రార్థిస్తూ ప్రారంభమవుతుంది.


➤ హలుడి గాథాసప్తసతి శివప్రార్థనతో ప్రారంభమవుతుంది. గౌరీ స్తోత్రంతో ముగుస్తుంది


శైవ మతం 


➤ శాతవాహనుల కాలంలో అమలులో ఉన్న శైవమతశాఖ - పాశుపత శైవము.


➤ ఈ మత స్థాపకుడు - లకులీస


➤ శైవమతంలో ప్రారంభమైన మొదటిశాఖ - పాశుపతం


➤ ఈ మతంలో ఆరాధ్యదైవం - పశుపతి


➤ ఈ శాఖలో బలి నిషిద్ధం


➤ ఈ శాఖ శాంతి సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇస్తుంది.


➤ ఆంధ్రదేశంలో అతి ప్రాచీన శైవమత దేవాలయం గుడిమల్లం (చిత్తూరు). ఇక్కడ 14 అడుగుల ఎతైన భారీ శివలింగం ఉంది. ఈ శివలింగం శాతవాహనుల కాలంలో

పూజలందుకుంది.. ఇది క్రీ.పూ. 2వ శతాబ్దం నాటికి చెందినది.


2) జైనమతం


➤ ఆంధ్రలో దిగంబర జైనం ఆధిపత్యం కనిపిస్తుంది.


జిన ప్రభాసూరి యొక్క కల్పప్రదీప గ్రంథం ప్రకారం శాతవాహనుల ఆస్థానంలోని 52 మంది సేనాపతులు తమ పేర్లపై 52 జైన దేవాలయాలను నిర్మించారు.


➤ అశోకుడి మనవడు సంప్రతి జైనమతాన్ని స్వీకరించి, ఆంధ్రదేశానికి జైన ప్రచారకులను పంపాడు.


➤ జైన తీర్థంకరుల్లో పదవ వాడైన శీతలనాథుడి జన్మస్థలం కొత్తగూడెం జిల్లా భద్రాచలం (బాదలపురి)


➤ శ్రీముఖుడు మొదట జైనమతాభిమాని అని కరీంనగర్ లోని మునుల గుట్ట వద్ద లభించిన నాణేల ద్వారా తెలుస్తున్నది. 


కొండకుందాచార్యుడు


➤ శాతవాహనుల కాలంలో ప్రసిద్ధ దిగంబర జైనమతాచార్యుడు -కొండ కుందాచార్యుడు 


➤ ఇతను క్రింది రెండు జైనతత్వాలను ప్రచారం చేసాడు. 


శాద్వాదము

అనెకాంతవాదము


➤ కొండకుండాచార్యుడు దిగంబర శాఖలో 2 ఉపశాఖలు బలాత్కారగచ్చము, వక్రగచ్ఛము ప్రారంభించాడు.


కొండకున్డాచార్యుడిరచనలు: 


• సమయసారము

• ప్రవచన సారము

• పంచస్థికాయ సారము


ముఖ్య జైన కేంద్రాలు:


• పొట్ల చెరువు (పటాన్ చెరువు)


• మునులగుట్ట (కరీంనగర్)


• కొలనుపాక 

• వేములవాడ 



3) బౌద్దమతం Buddhism in Shatavahna


➤ క్రీ.పూ. 6వ శతాబ్దాంలో గౌతమ బుద్ధుడు స్థాపించిన బౌద్ధమతం అతడి జీవిత కాలంలోనే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు వ్యాపించింది.


షంబల రాజు సుబేంద్రుని కోరికపై బుద్ధుడు అమరావతిని సందర్శించి, కాలచక్రమూల తంత్రోపదేశం చేసాడని టిబెటన్ బౌద్ధుల విశ్వాసం


➤ శాతవాహన రాజులు వైదిక మతం అవలంభించినప్పటికీ, బౌద్ధ మతాన్ని కూడా పోషించారు. శాతవాహన రాణులు మాత్రం బౌద్ధ మతాన్ని విశేషంగా ఆదరించారు.


గౌతమీ బాలశ్రీ మహారాష్ట్రలోని నాసిక్ గుహలను భద్రనీయ బౌద్ధశాఖ మతస్థులకు దానంగా ఇచ్చినది.


➤ ఆంధ్రలో ప్రారంభమైన మహాసాంఘిక బౌద్ధం శాఖను 'చైత్యకవాదమని' అంటారు.


చైత్యకవాద స్థాపకుడు -మహాదేవ భిక్షువు.


➤ శాతవాహనుల కాలంలో ప్రముఖ బౌద్ధమతాచార్యుడు - ఆచార్య నాగార్జునుడు


ఆచార్య నాగార్జునుడు Acharya Nagarjuna


➤ ఇతను రెండవ తథాగతుడు, రెండవ బుద్ధుడిగా పిలువబడ్డాడు.


➤ నాగార్జునుడి గురించి తెలుసుకొనుటకు ప్రధాన ఆధార గ్రంథం - లంకావతార సూత్రం (మైత్రేయ నాథుడు)


➤ లంకావతార సూత్రం ప్రకారం ఆచార్య నాగార్జునుడు 'వేదలి' అనే గ్రామంలో జన్మించాడు.


➤ వేదలి తెలంగాణలోనే ఉండి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం.


➤ ఇతను శ్రీ పర్వతంలో తన పేరుతో నాగార్జున విశ్వవిద్యాలయం ను ఏర్పాటు చేశాడు.


➤ ఇది భారతదేశంలోనే 2వ విశ్వవిద్యాలయం (మొదటిది - తక్షశిల)


➤ ఆచార్య నాగార్జునుడు ఆంధ్రదేశంలో మహాయాన బౌద్ధమతాన్ని విస్తరింపచేసాడు.


➤ ఆచార్య నాగార్జునుడు అమరావతి మహాచైత్యానికి ప్రాకారం, శ్రీశైలం వద్ద శైలమంటపాలను నిర్మించాడు.


➤ నాగార్జునుడు సంస్కృతంలో 24 గ్రంథాలు రాశాడు. అందులో ముఖ్యమైనవి.


1.సుహృల్లేఖ


➤ యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆచార్య నాగార్జునుడి మధ్య బౌద్ధమత అంశాలపై జరిగిన ఉత్తర, ప్రత్యుత్తరాల సారాంశం.


➤   ఆ కాలంలో ప్రతి విద్యార్థి ఈ సుహృల్లేఖ గ్రంథాన్ని కంఠస్థం చేసేవారని చైనా యాత్రికుడు ఇత్సింగ్ పేర్కొన్నాడు.


2. రత్నావళి


➤ రత్నావళి అనే గ్రంథంలో రాజపరికథ అనే అధ్యాయంలో మొదటిసారి 'శ్రేయోరాజ్య భావన' ను పేర్నొన్నాడు.


➤ ఈ గ్రంథంలో నాగార్జునుడు పరిపాలన విశేషాలను వివరించాడు.


3.ప్రజ్ఞాపారమిత శాస్త్రం


➤ విజ్ఞానానికి సరిహద్దు అని అర్థం


➤ ఈ గ్రంథం మహాయాన శాఖకు ప్రామాణిక గ్రంథంగా ఉన్నది.


ఇతర గ్రంథాలు:


• శూన్య సప్తతి 

• ఆరోగ్య మంజరి 

• రస రత్నాకరం (కెమిస్ట్రీపైన) 

• ప్రజ్ఞపారమిత 

• రసవాదం (ఫిజిక్స్ పైన) 

• మాధ్యమిక కారిక


➤ నాగార్జునుడు మహాయాన బౌద్ధంలో 2 కొత్త తత్వాలను ప్రారంభించాడు.


1) మాధ్యమికవాదము     2) శూన్యవాదము





శూన్యవాదము లో సాపేక్ష సిద్దాంతాల్లాంటి ఇన్ స్టీన్ కాన్సెప్ట్ ఉండటం వలన నాగార్జునుడిని 'భారత ఐన్ స్టీన్' పిలుస్తారు. గా


ఆచార్య నాగార్జునుడి బిరుదులు


• రెండవ తథాగతుడు (రెండవ బుద్ధుడు)


• ఇండియన్ ఐన్ స్టీన్


• ఇండియన్ మార్టిన్ లూథర్


• మాధ్యమిక వాద ప్రవక్త



➤ నాగార్జునుడి శిష్యుడు - ఆర్యదేవుడు.



➤ ఆర్యదేవుడి గ్రంథం - చిత్తశుద్ధి ప్రకరణము



➤ ఆర్యదేవుడు నాగార్జునుడి మరణం తర్వాత నాగార్జున విశ్వవిద్యాలయ అధిపతి అయ్యాడు.


శాతవాహనుల కాలంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాలు


• పెద్దపల్లి జిల్లా ధూళికట్ట


• నల్గొండ జిల్లా నందికొండ, గాజులబండ 


• సూర్యాపేట జిల్లా- ఫణిగిరి బౌద్ధ క్షేత్రం (ఇక్కడ బుద్ధుని పాదాలు, ధర్మచక్రం లభించాయి) 


• ఖమ్మం జిల్లా     - నేలకొండపల్లి (ఇక్కడ పాలరాతి స్థూపం, కాంస్య బుద్ధ విగ్రహం బయల్పడ్డాయి) 


• వరంగల్ - జీలకర్రగూడెం


➤ శాతవాహనుల కాలంలో నాగార్జున కొండ మహాయాన బౌద్ధానికి, అపరశైల చైత్యకవాదానికి ప్రసిద్ధి చెందినది.


 ➤ నాగార్జున కొండ దేశంలోనే గొప్ప ద్వీపమ్యూజియం గా గుర్తింపు పొందింది.


వాస్తు,శిల్పకళ
 Architecture, sculpture in Shatavahana


➤ శాతవాహనుల కాలం నాటి శిల్పకళకు అమరావతి శిల్పకళ అని పేరు.


అమరావతి స్థూపం


➤ గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరంలో గల అమరావతి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం.


➤ అమరావతి స్థూపాన్ని మొదట 'కల్నల్ క్వాలిన్ మెకంజీ' (సర్వే ఆఫ్ ఇండియా మొదటి డైరెక్టర్ జనరల్) 1797 లో కనుగొన్నాడు.


➤ అమరావతి స్థూపం చుట్టుకొలత - 435 అడుగులు ఎత్తు - 20 మీటర్లు


➤ శాతవాహన రాజు 2వ పులోమావి కాలంలో అమరావతి స్థూపం నిర్మించబడింది.


➤ అమరావతి స్థూపంలోని 'ఆయకపతము' అను పాలరాతి పలక పైన బుద్ధ చరిత్రలోని ఘట్టాలను చిత్రించారు. వీటిని మహా పంచకళ్యాణములు అంటారు. అవి:


1. బుద్దుని జననం - తామర


2. మహాభినిష్క్రమణం - గుర్రం


3. జ్ఞానోదయం - రావిచెట్టు 


4. ధర్మచక్ర పరివర్తనం - చక్రం


5. మహాపరి నిర్యాణం - స్థూపం


➤ ఆయకపతములపై పూర్ణకుంభము, వినాయక చిత్రము చెక్కబడి ఉన్నాయి.


➤ అమరావతి శిల్పకళ గురుంచి పెర్గుసన్ అనే చరిత్ర కారుడు అమరావతి శిల్పాలలో వక్తమగు కళాకౌశలం భారతీయ కళకే పరాకాష్ట అని పేర్కొన్నాడు.


తెలంగాణాలోని స్తూపాలు 

➤ తెలంగాణాలోని ధూళికట్ట పాశాయిగాం స్తూపాలు అమరావతి స్తూపం కంటే ప్రాచినమైనవి  


➤ ధూళికట్ట బౌద్ధస్థూపం క్రీ.పూ. రెండో శతాబ్దంలో నిర్మించబడినట్లు ఆధారాలున్నాయి.


ధూళికట్ట బౌద్ధస్థూపం ఒక ఫలకం మీద గౌతమబుద్ధుని పాదముద్రల పైన ఐదు శిరస్సులు గల నాగముచిలిందుడి శిల్పాన్ని చెక్కారు.


➤ శాతవాహనుల కాలంలో ఎక్కువగా బౌద్ధమతానికి చెందిన 'చైత్యాలు, స్థూపాలు, విహారాలు' నిర్మించారు.


స్థూపం


➤ గౌతమబుద్ధుడు లేదా బౌద్ధ గురువుల అస్థికలు, అవశేషాల పై నిర్మించిన నిర్మాణాలను స్థూపాలు అంటారు.


➤ ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచీన స్థూపం - భట్టిప్రోలు


 ➤ ఇవి కాకుండ ఆంధ్రలో కొన్ని గుహాలయ స్థూపాలు కూడా ఉన్నాయి.


ఉదా : గుంటుపల్లి (పశ్చిమగోదావరి),


శంకరం గుహాలయ స్థూపాలు


స్థూపాలు 3 రకాలుగా నిర్మిస్తారు.


1. ధాతుగర్భ స్థూపాలు బుద్దుడు మరియు ఇతర బౌద్ధమతాచార్యుల శారీరక అవశేషాలపై నిర్మించిన స్థూపాలు


2. పారిభోజక స్థూపాలు - గొప్ప బౌద్ధ బిక్షువులు వాడిన వస్తువులు లేదా మతగ్రంథాలపై నిర్మించే కట్టడాలు


3. ఉద్దేశిక స్థూపాలు - లోపల ఏ వస్తువు నిక్షిప్తం చేయకుండా బుద్దునిపై గల భక్తి భావాలను వెల్లడిస్తూ నిర్మించే స్థూపం. ప్రపంచంలో అతి పెద్ద స్థూపం - బోరోబుదూర్ స్థూపం (ఇండోనేషియా)


➤  భారతదేశంలో అతి పెద్ద స్థూపం - సాంచీ స్థూపం 


విహారం


➤ బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలను విహారాలు అంటారు. ఇవి చతురస్రాకారంలో ఉంటాయి. 


చైత్యము



➤ బౌద్ధ సన్యాసుల ప్రార్థనా మందిరం ఆలయంను - చైత్యములు అంటారు.


➤ ఇవి దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి.


➤ ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచీన చైత్యము - గుంటుపల్లి 


కార్లే   - దేశంలోని అతిపెద్ద గుహాలయ చైత్యం ఇది మహారాష్ట్రలో ఉంది. దీనిని శాతవాహనులు నిర్మించారు.


ఆరామం


➤ స్థూపం, విహారం, చైత్యం, విద్యాలయం ఒకే చోట ఉంటే ఆ  ప్రాంతాన్ని ఆరామం అంటారు.


➤ గుహాలయ ఆరామానికి ఉదాహరణ - గుంటుపల్లి 


చిత్రలేఖనం
Paintings in Shatavahana


➤ అజంతా గుహల్లోని 9, 10 సంఖ్యల గుహల్లోని వర్ణ చిత్రాలు శాతవాహనుల కాలం నాటివి.


➤ అజంతాలోని 10వ గుహలోని శ్వేత గజజాతక / షడ్దంత జాతక కథ చిత్రం అనే చిత్రం శాతవాహన కాలం నాటిది. 


➤ అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాదు జిల్లాలో ఉన్నాయి.


➤ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పూర్తి వికసిత చిత్ర లేఖనం అజంతాలో కనిపిస్తుంది.


➤ శాతవాహనుల కాలం నాటి అద్భుత శిల్పం గుడిమల్లంలో చెక్కబడిన త్రిశూల దారి అయిన శివుడు.


తెలుగు బాషా ఆవిర్భావం
Emergence of Telugu Language in shatavahana



➤ తెలుగు భాష శాతవాహనుల కాలంలోనే ఆవిర్భవించింది. 


➤ తెలుగులో మొట్టమొదటి పదం - నాగబు (అమరావతి శాసనంపై కలదు)


➤ మ్యాకోధని శాసనంలో ఉన్న తెలుగు పదం - వేపూరు 


➤ తెలుగులో మొదటి చంధోరూపం - కందం


➤ హలుని గాథాసప్తశతిలో అనేక తెలుగు పదాలు కనిపిస్తాయి.


ఉదా : అందం, అత్త, పొట్ట, అద్దం, తుప్పు, పాడి, మైల, పంది, పిల్ల


శాతవాహన  పూర్వ యుగం ఆర్టికల్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి 


ఇక్ష్వాకుల ఆర్టికల్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి  



Post a Comment

0 Comments